Posted by Sakshyam Magazine on Saturday, October 26, 2013
గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు,నేను మీకు ప్రచురము చేయుచు చేయు యేసేక్రీస్తయి యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాతంలనెత్తి చెప్పుచు,వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అపొ//కా :17:2-3
ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి,మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. రోమా:4:25
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. రోమా 10:9
నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. 2వ తిమోతి 2:8
యేసు మరణించిన తరువాత పునరుత్థానమయ్యారని పౌలు ప్రచారం చేసినట్లు పై వాక్యాలలో తెలుస్తుంది.అయితే ఇది అంతిమ పునరుత్థానము గురించా? కాదు.కాని యేసు సిలువపై మరణించినట్లు అపోహకు గురయై తరువాత మూడవరోజు మృతులలో నుండి సజీవంగా లేచారని జరిగిన ప్రచారానికి సంబంధించిన పునరుత్థానము.
క్రింది వచనాలను గమనించండి.
యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకుని వచ్చును.మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటే ముందుగా ఆయన సన్నిధినిఒ చేరదము.ఆర్భాటముతోనూ,ప్రధానదూత శబ్ధముతోనూ దేవును బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును.క్రీస్తునందుండి మృతులైనవారు మోదట లేతురు.ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీదకొని పోబడుదుము.కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ వుందుము.కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి. 1వ ధెస్సలోనియకకు 4:14-18
యేసు పునరుత్థానమును గూర్చి ప్రచారం చేస్తూ పై వచనాలలో అంతిమ పునరుత్థానము [GENERAL RESURRECTION] గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు యేసునందు నిద్రించిన వారు అనగా యేసుపట్ల విశ్వాసముంచి మరణించినవారు అందరికంటే ముందు లేస్తారని, అప్పటికి ఇంకా బ్రతికి ఉన్న క్రైస్తవులు యేసును అనుసరించి వెళ్తారు.అయితే అన్యుల గూర్చి ఇక్కడ ఏమీ చెప్పలేదు.అప్పటికి ఇంకా బ్రతికి ఉన్న క్రైస్తవులు మేఘాలలో కొనిపోబడి,యేసునుందు మరణించి మోదటి ఫలముగా పునత్థానము చెందిన వారితో కలిసి యేసును ఎదుర్కొని వెంబడిస్తారు.ఆ విధంగా అప్పటికి బ్రతికి ఉన్నవారు మరణము-పునరుత్థానము అనెడి సహజ ప్రక్రియలకు లోనుకాకుండా నిరంతరం బ్రతికి ఉంటారు.ఇది పౌలు ప్రచారం.ఇది ఎంతవరకూ వాస్తవమో పరిశీలిద్దాం.
యేసు పునరుత్థానము గూర్చి చర్చించే ముందు అంతిమ పునరుత్థానం [GENERAL RESURRECTION] గూర్చి ముందు ఆలోచిద్దాం.
దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది.ఆ కాలమున సమాధులలో నున్న వారందరు ఆయన శబ్ధము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. యోహాన్ 5:28-29
పునరుత్థానదినం నాడు- మృతులను తీర్పు గూర్చి సమాధిలలో నుండి లేపటానికి యేసు వస్తారని యోహాన్ సువార్తలోని పై వాక్యాలు తెలుపుతున్నాయి.ప్రళయం నాడు ప్రపంచం అంతా అంతమైపోతుంది.ఆ నాడు ప్రతిజీవి మరణించి,అంతా నాశనమైపోతుంది.ఆ తరువాత అంతిమ పునరుత్థానము [GENERAL RESURRECTION] సంభవిస్తుందనేది యధార్ధం.అలాంటప్పుడు కొందరు క్రైస్తవులు మేఘాలలో యేసును ఎదుర్కొనబోయి నిరంతరం ఆయనతో సజీవంగా ఉండిపోవడానికి,ప్రళయం నాడు మరణించకుండా ఉండడం ఎలా సాధ్యం? ఈ విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాకుండా దీనిని ప్రచారం చేయమంటాడు పౌలు. [ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించికోండి] ఇంకా పై వచనాల [యోహాన్ 5:28-29]లో 'తాను మృతులను లేపుటకు వచ్చునప్పుడు కొందరు క్రైస్తవులు సజీవంగా ఉంటారు.వారిని మేఘములలో నాతోపాటు కొనిపోతాను.వారు నిత్యం నాతో ఉంటారూ అని యేసు చెప్పకపోవడం మరో విశేషం.
Next Page-2