క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యథార్ధాలు: "రక్షణ కొరకు తప్పక తెలుసుకోవలసిన ఆరు వాస్తవాలు."
ఈ ప్రశ్నలకు వాక్యం వెలుగులో సరైన సమాధానాలేమిటో తెలుసుకుని ఆచరిస్తేనే రక్షణ!
* యేసు ఎవని సువార్త ప్రకటించారు?
* దేవుడు, యేసును ఈ లోకానికి పంపైంచింది ఆరాధించటానికా? లేక ఆయన మాట వినటానికా?
* ఎవనిని ప్రార్ధించాలి? యేసునా?యెహోవానా?
* కృతజ్ఞతాస్తుతులకు అర్హుడు యేసా? యెహోవా?
* యేసు పాపిని రక్షిస్తారా? లేక పాపాలను విడిచిన వానిని రక్షిస్తారా?
* ప్రజలను తన వైపునకు ఆకర్షించుకునే సహజ శక్తి యేసుకు ఉందా?
పై ప్రశ్నలకు సమాధానం దొరకనన్ని రోజులు మనిషికి రక్షణ లేదు.మరి ఆ సమాధానాలేమిటో తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందే!
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
క్రైస్తవ పండితుల అపార్ధాలు -బైబిల్ గ్రంధ యధార్ధాలు:"తండ్రీ!"-"కుమారా!" సంబోధనల వాస్తవికత.
దేవునికి ఇష్టులుగా నడుచుకునే వారందరూ దేవుని కుమారులుగా పరిగణింపబడతారని పాత మరియు క్రొత్త నిబంధనల ద్వారా తెలుస్తుంది.ఇక అటువంటప్పుడు యేసు మాత్రమే దేవుని కుమారుడెలా అవుతాడు? దేవుడు యేసును కుమారుడని సంభోధించినంత మాత్రాన దేవునికే వారసుడయిపోతే? ఇంతకు ముందు కుమారుల పరిస్థితి? ఇంతకీ తండ్రి,కుమారుడు అంటే ఏమిటి? ఆ సంబోధనల యొక్క వాస్తవికత ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ తెలియాలంటే ఈ క్రింది పుస్తకం చదవాల్సిందే!
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాలు: "యేసు దేవుడా? క్రీస్తా?"
క్రైస్తవ సమాజంలో ఈరోజు అనేక విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఎవరి విశ్వాసాన్ని వారు సమర్ధించుకుంటూ బైబిల్ చూపిన మార్గాన్ని పూర్తిగా విస్మరించియున్నారు.ప్రధానంగా కలిగియుండాల్సిన దేవుని విషయంలోనే అనేక బైబిల్ విరుద్ధమైన సిద్ధాంతాలను కల్పించుకున్నారు.వాటిలో ప్రధానమైనవి..యేసు దేవుడని,దేవునిలో భాగమని...త్రియేక దేవుడని ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల విశ్వాసాలు తాండవిస్తాయి.అయితే బైబిల్ ప్రకారం యేసు ఎవరు? ఆయన దేవుడా?క్రీస్తా? ఏమిని విశ్వసిస్తే మనకి రక్షణ దొరుకుంది.ఇత్యాది విషయాలన్నీ కూలంకషంగా విడమర్చి చెప్పిన పుస్తకం: "యేసు దేవుడా? క్రీస్తా?"
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు: "యేసు దృష్టిలో దేవుడెవరు?"
వాస్తవానికి యేసు బోధించిందేమిటి? నేటి సువార్తికులు బోధిస్తున్నదేమిటి? ఏనాడైనా యేసు నేను దేవుడనని బోధించుకున్నారా? త్రిత్వము,త్రియేక దేవుడనే విశ్వాసాన్ని బైబిల్ సమర్ధిస్తుందా? అసలు యేసువారు ఏమి బోధించారు? ఆయన బోధనలలో దేవుడెవరు?...ఇత్యాది విషయాలన్నీ కూలంకషంగా చర్చించబడిన పుస్తకం: "యేసు బోధనలలో దేవుడెవరు?". పై ప్రశ్నలకు సమాధానం కోసం ఈ పుస్తకం చదవాల్సిందే!
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
క్రైస్తవ పండితుల అపార్ధాలు - బైబిల్ గ్రంధ యధార్ధాలు: యేసు దైవత్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధం సమర్ధిస్తుందా? లేదా?
ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంధం వరకూ ఎక్కడా యేసు దేవుడని పేర్కొన బడలేదు.సరికదా లేఖనాల ప్రకారం ఆయనను క్రీస్తుగానే ప్రకటితమయ్యారు. ఆయనగాని, ఆయన శిష్యులుగాని దేవుడని ప్రకటించలేదు. కాని నేటి సువార్తికులు మాత్రం ఆయనను దేవునిగానే కొలుస్తున్నారు. ప్రకటిస్తున్నారు. నిజానికి ఈనాడు సువార్తికులు ప్రకటించే యేసు దైవత్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధం సమర్ధిస్తుందా? ఇత్యాది విషయాలను బైబిల్ వెలుగులో పరిశీలించి వ్రాసిన అద్భుత పుస్తకం :యేసు దైవత్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధం సమర్ధిస్తుందా? లేదా?
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్థాలు : దేవుడు త్రిత్వమా? ఒక్కడా?
రోమన్ కేథలిక్ క్రైస్తవులు దేవుడు త్రిత్వమై ఉన్నాడని..అంటే మాత,పిత,కుమారా,కలిపి దేవుడని నమ్మితే ప్రొటెస్టంట్ క్రైస్తవులేమో తండ్రి,కుమార,పరిశుద్ధాత్మ కలిపి త్రిత్వమని నమ్ముతారు.వీరి విశ్వాసాలు ఒకరికొకరికి ఏవిధమైన సంబంధాలు ఉండవు.ఇకపోతే యెహోవా మాత్రమే దేవుడని,యేసు దేవుడు కాదని నమ్మే వర్గం కుడా ఉంది.ఇలా రకరకాల డినామినేషన్ల పేర్లతో 2000 సంఘాలకు పైగా ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో నెలకొని ఉన్నాయి.ఒక డినామినేషన్ కి ఒక డినామినేషన్ కి మధ్య ఏవిధమైన సంబoధం లేదు.అసలు బైబిల్ వెలుగులో దేవుడు ఎవరు?ఆయన ఒక్కడా? త్రిత్వమా? ఏ విశ్వాసాన్ని బైబిల్ ప్రకటిస్తుంది? ఇత్యాది విషయాలన్నీ కూలంకషంగా చర్చించబడిన పుస్తకం: "దేవుడు త్రిత్వమా? ఒక్కడా?"
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
పౌలు దృష్టిలో దేవుడెవరు? యేసు ఎవరు?
పాతనిబంధనలోని లేఖనాల ప్రకారం దేవుడు యేసు రూపంలో వస్తాడని ఎక్కడా చెప్పబడిలేదు.పాత నిబంధన ప్రకారం యెహొవా మాత్రమే దేవుడని చెప్పబడింది.ఇక కొత్త నిబంధన విషయానికి వస్తే యేసు నేను దేవుడనని ఎక్కడా చెప్పుకోలేదు. సరికదా ఆయన శిష్యులు కూడా యేసును దేవునిగా ఎక్కడా ప్రకటించలేదు.పోనీ ఈరోజు ఎక్కడ చర్చిలో చూసినా ఎక్కువుగా ప్రకటించబడే పౌలు పత్రికల్లో కూడా యేసు దేవుడని ప్రకటించబడిందా? క్రీస్తని ప్రకటించబడిందా? ఇంతకీ ఎవరు దేవుడని అపొస్తలుడైన పౌలు ప్రకటించాడు? ఇత్యాది విషయాల అవగాహన కొరకు ఈ క్రింది పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే!
- *******-