Posted by Sakshyam Magazine on Wednesday, October 8, 2014
1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు)
"రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వేదములందుగనబడదు. -సత్యార్ధప్రకాశం పేజి నెం:270
"మూర్తిపూజకు లెల్లరు నజ్ఞానులైయుండి మనుష్యజన్మమును వ్యర్ధము చేసికొని మరణించిరి" -సత్యార్ధప్రకాశం పేజి నెం:273
2.వేదవేదాంగ పారంగత్ పండిత గోపదేవ్ శాస్త్రి
"దయానందుడు వేదములలోగాని,ఉపనిషత్తులలోగాని దేవాలయములను దర్శించమని, విగ్రహాది జడమూర్తులను ఉపాసించమని ఎక్కడలేదన్నాడు.కనుక దయానందుణ్ని నాస్తికుడన్నది ఈ లోకం.నా దృష్టిలో అసలు నాస్తికులు విగ్రహారాధకులే.ఈ విగ్రహారాధన పూర్వం వైదిక మతస్తులలో లేదు.ఇది బౌద్ద,జైనుల నుండి మనకు సంక్రమించినది. -ఈశ్యావాస్య ఉపన్యాసములు పేజి నెం:102
3.యోగి వేమన
రాతి ప్రతిమ తెచ్చి రాజసంబునెంచి పూజసేయు నరుడు పూజమాలి
భావ మందు నరుడు భావింపనేరడు విశ్వదాభిరామ వినురవేమ
"బుద్ధిలేని నరులు భగవంతుడు తమలోనే ఉన్న సత్యం గ్రహించలేక రాతిని విగ్రహంగ మలచి పూజలు చేస్తారు.ఇలాంటి వారికి ముక్తి లభించదు. -నిక్కమైన నీలాలు పేజి నెం:302
4.యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు
"యే రూపములో ఉన్నను వుగ్రహారాధనను మనము విషసర్పమును చూచినట్లు చూచి ద్వేషించుచు సర్వవిధముల చేతను దానినంతమొందిప మన శక్తియుక్తులను వినియోగించి పాటుపడవలయును.మనుజుడే దినమున విగ్రహారాధన పీడనుండి విడివడులో ఆదినమే అతని జీవితకాలములోకెల్ల మహాదినము. -ఈశ్వరుని పితృభావము పేజి నెం:3
"బుద్దిమంతులయిన వారందరును ప్రతిమార్చనను ముందుగా మాని ఈశ్వర మహిమలను విగ్రహములయందు గాక సృష్టియందు జూడ యత్నింపవలెను. -ఈశ్వరోపాసనము పేజి నెం:5,6
5.రాజా రామ్మోహన్ రాయ్ (బ్రహ్మ సమాజ స్థాపకులు)
"భగవంతుడొక్కడే అనియు,విగ్రహారాధన దేవునవమానించుట యగుననియు యజ్ఞయాగాది క్రతువులను చేయరాదనియు ,స్త్రీలకు సహగమనము తగదనియు, వితంతువులు మరలా వివాహము చేసుకోవచ్చనియు, కులభేదములు కూడదనియు ప్రచారం చేసిరి" -హిందూమత పునరుద్దరణము పేజి నెం:28
6.యుగ సంస్కర్త శ్రీ స్వామి వివేకానంద
"విగ్రహాలు, దేవాలయాలు, ప్రర్ధనాలయాలు, గ్రంధాలు -యివన్నీ మానవుడి పారమార్ధిక శైశవంలో- ప్రారంభావస్థలో- కేవల సహాయభూతాలు, ఊతగర్రలు. కాని అతడు పురోగాభివృద్ధి పొందాలి.గమ్యప్రాప్తి పర్యంతం సాధన చేస్తూండవలసిందే.వేదాలు ఇలా చాటుతున్నాయి. "అభ్యుదయాన్ని పొందే ప్రయత్నంలో బాహ్యపూజ-భౌతికారాధన- అధమం. మానసికమైన ఉపాసన మాధ్యమం; బ్రహ్మానుభూతే ఉత్తమం" -హిందూమతము పేజి నెం:17
7.శ్రీ కుమ్మితి ధర్మాంగద రెడ్డి
పాషాండ విగ్రహములను భగవంతుని స్థానములో పెట్టి భట్రాజుల వలె పొగడ్తలతో సంస్కృత శ్లోకములు రచించి వాటినిమంత్రములని జనులని నమ్మించి వంచన చేయుచున్నారు. -తొలిపులుకులు పేజి నెం:2 వేదాంత జ్ఞాననిధి.
8.బ్రహ్మశ్రీ గుత్తికొండ వెంకటేశ్వర శర్మ
"దేవుని మందిరంలో రకరకాల దేవుళ్ల చిత్రాలు, బొమ్మలు, బాబాల ఫోటోలు, స్వాముల పటాలు వుండకూడదు. వేదాలు విగ్రహాలను పూజించటం అంగీకరించవు.ప్రపంచంలోని అన్ని మతాలకు ఒక్కడే దేవుడున్నాడు.మనం కూడా "దేవుడు ఒక్కడే" అని చెబుతూ యింటి నిండా దేవుని మందిరము నిండా రకరకాల దేవుని బొమ్మలతో నింపేసి మనోనిశ్చలతను దూరం చేసుకొంటున్నాం.ఈ పద్దతి ధ్యానానికి మంచిది కాదు.ఒక్కో వారాన్ని ఒక్కొక్క దేవునికి అంకితం చేసి మనసు మలినం చేసుకొంటున్నం. -సాంప్రదాయక శాస్త్రపీఠం పేజి నెం:335
స్వయంగా హిందూపండితులు "విగ్రహారాధనను అజ్ఞానమని, మూఢత్వమని, విషసర్పమని, "విగ్రహారాధకులను నాస్తికులని మరియు బాహ్యపూజ భౌతికారాధన అధమం" అని ప్రకటించడం చూసాం. అయితే పై ప్రకటనలు చేస్తుంది క్రైస్తవ,ముస్లిం పండితులు కాక స్వయంగా హిందూ పండితులే నన్నది ఇక్కడ అత్యంత గమనార్హం. వందశాతమూ నికార్సయిన హిందూ పండితుల ప్రకారం -మానవ జన్మను సార్ధకం చేసుకోవటానికి "పరోక్ష" ఈశ్వర (విగ్రహ)ఆరాధన నుండి "ప్రత్యక్ష" ఈశ్వర (నిరాకార) ఆరాధనలోనికి మారిన దినమే మహాదినం పర్వదినమని తెలుస్తోంది. మన దినకర్మ రాకముందే అలాంటి దినాన్ని పొందే మహద్భాగ్యాన్ని ఆ సర్వేశ్వరుడు మనందరికీ ప్రసాదించుగాక!