Posted by Sakshyam Magazine on Tuesday, September 16, 2014
సందేశరంగంలో ఒక వర్గం ఖురాన్ తో పాటు పూర్వపు గ్రంధాలను కూడా ప్రచారం చేయాలని బోధిస్తుంటే,మరొక వర్గం బోధించకూడదని వాదిస్తోంది.ఈ రెండు వాదనల నడుమ సామాన్య ముస్లిములు నలిగిపోతున్నారు.చివరికి ఎవరికి నచ్చిన వర్గంలో వారు కొనసాగుతూ రెండు గ్రూపులుగా చీలిపోయారు.నిజానికి ఖురాన్ ప్రకారం పూర్వపు గ్రంధాలతో సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందా?లేదా?..సందేశ రంగంలో ఒక ప్రచారకుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సందేశ రంగ మెళుకువలేమిటి? అన్ని రంగాలలో మార్గం చూపించిన అల్లాహ్ (సర్వేశ్వరుడు) సందేశరంగంలో చూపించిన విధానమేమిటి? ఇత్యాది పరిశీలనాత్మకమైన అంశాలను చక్కగా వివరించిన ముష్తాఖ్ అహ్మద్ గారి పుస్తకం:అల్లాహ్ సందేశ విధానం.ప్రతి ధర్మ ప్రచారకుడు చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకంలో మొత్తం 12 భాగాలు ఉంటాయి.ఒకొక్క భాగాన్ని Download చేసుకోండి.
సందేశ గ్రహీతలకు చెందిన ధార్మిక మహనీయుల - ధార్మిక గ్రంధాల ప్రబోధనల ఆధారంగా సందేశం ఇవ్వకపోవడం అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించడమే అవుతుంది.