Posted by Sakshyam Magazine on Sunday, July 13, 2014
నేడు గోవధ నిషేదం ఒక రాజకీయ నినాధం తప్ప వేద నిషేధం కాదు.ఆనాడు ఆర్యులు కాని,వేద అనుచరులుగాని మాంసాహారులే.వారు చేసే యజ్ఞాలకు ఎన్నో అశ్వాలు,ఆవులు ఇతర జంతువులు బలి అర్పిస్తూ ఉండేవారు.యజ్ఞాలలో అర్పించబడిన జంతువులను వారు భుజిస్తూ ఉండేవారు.
స్వామి భాస్కరానందగారి మాటల్లో....
స్మృత్యనుసారంగా ఆనాటి వారికి కొన్ని జంతువుల మాంసం నిషేధం కాదు.మాంసాహారమంతగా నిషిద్ధం కాకపోయినా మనువు శాకాహారమే జీవహింస దృష్ట్యా శ్రేష్టమన్నాడు.మాంసాహారం తీసుకోవడం పాపమేమీ కాదు.కానీ తినకపోవడం ఎంతో మంచిది.ఏ ఆహారమైనా,మాంసమైనా ముందుగా దైవార్పణం చేసి తినాలి.వేదకాలం నాటి ఆర్యులు గోమాంసం భక్షకులా?కాదా? అన్న మీమాంస ఒకటి ఉన్నదివారు తినారన్నది సత్యమే.కానీ పాలిచ్చే ఆవులనెన్నడూ వారు చంపలేదు.ఆవును ఆఘ్న్యా అనేవారు.అంటే చంపకూడదని దీని అర్ధం.ఎడ్లు, లేతదూడలు,గొడ్డుబోతు ఆవులను మాత్రమే తినేవారు.ఆవుమాంసం తినకూడదన్న సంప్రదాయం చాలా ఇటీవల కాలంలో వచ్చింది.దీనికి కారణం జైనమతమని కొoదరంటారు.
-
స్వామి భాస్కరానంద [హిందూమత సారాంశం 58,59]
మధ్యందినేర్ధరాత్రే చ శ్రాద్ధం భుక్త్వా చ సామిషం
సంధ్యయో రుభయోశ్పైవ న నేవేత చతుష్పధం - మనుధర్మశాస్త్రం 4:131
మిట్టమధ్యాహ్నమునను, నడురాత్రియందును, మాంసముతోడ శ్రాద్ధభోజనము చేసియు, ప్రాతస్సాయం సంధ్యాకాలములందును నాలుగుదారులు గలియచోటును బహుకాలముండరాదు.
అనుపాకృతమాంసాని దేవాన్నాని హవీం షి చ - మనుధర్మశాస్త్రం 5:7
యాగమున మంత్రముతోగాక యూరకచంపబడిన జంతుమాంసమును,దేవతలకై చేసియు నివేదనము చేయబడనియన్నము, హోమమునిమిత్తము సిద్ధం చేసియు నాహోమము చేయక ముందుపయోగించెడి హవిస్సును భక్షింపజనదు.
పాఠీనరోపి తావాదౌ నియుక్తౌ హవ్యకవ్యయో:
రాజీవా సిమ్హతుండాంశ్చ సశల్కాంశ్పైవ సర్వశ: - మనుధర్మశాస్త్రం 5:16
భక్షణార్హమత్స్యములను జెప్పుచున్నాడు -వేయికోఱలుగల చేపలు,ఎఱ్రమీలు,వీని రెండిటిని,గుంపుతో గూడి తిరుగు చేపలు,సింగపుమోము చేపలు,ముడ్లచేపలు వీనిని హవ్యకవ్యములయుదు నిమంత్రితులైన బ్రాహ్మణులు భుజింపవచ్చును గాని తక్కిన కర్తలు మొదలగువారు భుజింపరాదు.అందఱును వీనిని దక్కిన సమయములలో భక్షింపరాదు.
అల్లాహ్ నిషేధించినవి ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే: మరణించిన వాటిని తినకండి.రక్తాన్ని పందిమాంసాన్ని ముట్టకండి.ఇంకా అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తనకండి కాని ఏవరైనా గత్యంతరం లేక వాటిలోని ఏ పదార్ధాన్నయినా తింటే అది పాపం [దోషం] కాదు.
- ఖురాన్ 2:172
శ్వావిధం శల్యకం గోధాం ఖడ్గకూర్మశశాంస్తథా
భక్ష్యా పంచనఖేష్యాహురనుష్ట్ర్యాంశ్పైకతోదత: - మనుధర్మశాస్త్రం 5:18
అట్లు పంచనఖములయిన వానిలో నేదేని భక్షింపదలంపు గలిగినచో ఏది పంది,ముడ్లపంది,ఉడుము,ఖడ్గమృగము, తాబేలు, కుందేలు వీనినొక్కవేళ భక్షించిన భక్షింపవచ్చునుగాని, తక్కిన పంచనఖమృగములను భక్షింపరాదు.మరియు ఒంటెలుదప్ప దక్కిన యొక్క పంటివరుసగల మృగములను భక్షించినను వంతగ దోషము పాటింపజనదు.
అనగా ఆపదలందు విధి లేక తిన్నచో దోషశంక రాదు.
పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం చేయబడ్డాయి.మీరు తర్పీదు ఇచ్చిన వేట జంతువులు -దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్పీదును ఇచ్చినవి -అవి మీ కొరకు పట్టిన జంతువులను కూడా మీరు తినవచ్చు - ఖురాన్ 5:4
కనుక వేటాడు కుక్కలచే జంపబడిన మృగముల మాంసము పరిశుద్ధమని మనువు చెప్పెను
-మనుధర్మశాస్త్రం 5:131
వర్జయేన్మధుమాంసం చ గంధం మాల్యం రసా స్త్రియ: - మనుధర్మశాస్త్రం 2:176
బ్రహ్మచారి తేనెను, మాంసమును భక్షింపరాదు.
దైవనామస్మరణ [జిఫా] చేసిన తర్వాతనేమాంసమును భుజింపవలయును
అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి -ఖురాన్ 2:172
పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం చేయబడ్డాయి.మీరు తర్పీదు ఇచ్చిన వేట జంతువులు -దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్పీదును ఇచ్చినవి -అవి మీ కొరకు పట్టిన జంతువులను కూడా మీరు తినవచ్చు.కాని దానిపై అల్లాహ్ [దైవం]పేరును ఉచ్చరించండి. -ఖురాన్ 5:4
అనుపాకృతమాంసాని దేవాన్నాని హవీం షి చ - మనుధర్మశాస్త్రం 5:7
యాగమున మంత్రముతోగాక యూరకచంపబడిన జంతుమాంసమును,దేవతలకై చేసియు నివేదనము చేయబడనియన్నము, హోమమునిమిత్తము సిద్ధం చేసియు నాహోమము చేయక ముందుపయోగించెడి హవిస్సును భక్షింపజనదు.
అసంస్కృతా సశూ మంత్రై ర్నాద్యాద్విప్ర: కదాచన -మనుధర్మశాస్త్రం 5:36
వేదమంత్రములచే బ్రోక్షణమునేయక యూరక చంపబడిన పశువులను విప్రుడెన్నడును భుజింపరాదు.
పందిమాంసం నిషిద్ధం
మీకు ఇవి నిషేధించబడినాయి-మృతపశువు,రక్తము,పందిమాంసము,దేవుని పేరుతో కాక మరెవరి పేరుతోనైనా జిబాహ్ [కోయబడిన] చెయ్యబడిన పశువు - ఖురాన్ 5:3
వరాహ మాంసం అమ్మేవారి కుడిచెయ్యి,ఎడమకాలు లేదా ఎడమకాలు కుడిచెయ్యి ఖండించాలి
-విష్ణుస్మృతి 5:49.
> మరిన్ని వేద అంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.