Posted by Sakshyam Magazine on Thursday, July 10, 2014
యేసు దేవుడని లేక
'తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటేన"ని ఏ ప్రచారమైతే నేడు క్రైస్తవంలో జోరుగా సాగుతుందో అది,యేసు సువార్తకు ఏమాత్రం సంబంధం లేని అన్య విశ్వాసాలని చెప్పటానికి బలమైన ఆధారం వీటిని నిరూపించే ఎటువంటి రుజువులూ పరిశుద్ధ బైబిల్ గ్రంధంలో ఇసుమంతైనా లేకపోవడమే!!మొత్తానికి యేసు దైవత్వాన్ని ఏదో విధంగా నిరూపించాలనుకున్న ప్రయత్నంలో భాగంగా అన్యుల నుండి తెచ్చుకున్నదే ఈ త్రిత్వదైవత్వపు వాదం.
క్రైస్తవంలో యేసు దైవత్వ సిద్ధాంతం ప్రవేశపెట్టింది ఎవరు?దేవుడా?అన్యుడా?
ఇక యేసు దైవత్వపు సిద్ధాంతం సైతం యేసు అనంతరం 325వ సంవత్సరంలో విగ్రహారాధకుడైన బాప్తిస్మం పొందని అన్య రోమన్ చక్రవర్తి
'కైసర్ ఫ్లావిస్ కాన్ స్టన్ టైన్" ఆధ్వర్యంలో జరిగిన నైసియా సభలో నాడు క్రీస్తు బోధించిన '
పరిశుద్ధ ఏక దైవ ఆరాధనా విశ్వాసంలో
ఈ అపరిశుద్ధ అనేక దైవారాధన విశ్వాసం"యుక్తిగా చొప్పించబడిందని క్రైస్తవ చరిత్రకారులు ఏకరువుపెడుతున్నారు.
'బాప్తిస్మం తీసుకొనని ఈ చక్రవర్తే నైసియా సభకు అధ్యక్షత వహించి దేవుడు [యెహోవా]మరియు యేసు ఒకేసారం కలిగి ఉన్నారనే విశ్వాసాన్ని ప్రతిపాదించటంలో ప్రధాన పాత్ర వహించాడు. -
ది ఎన్ సైక్లోపిడియా బ్రిటానికా
క్రైస్తవంలో త్రిత్వ సిద్ధాంతం ప్రవేశ పెట్టింది ఎవరు?
దేవుడు త్రిత్వమై ఉన్నాడాన్న సిద్ధాంతం మొట్టమొదట అన్యుడైన '
అతనసిస్" అనే ఈజిప్టు పండితుని ద్వారా అలెగ్జాండ్రియాలో క్రీస్తుశకం 325వ సంవత్సరంలో క్రైస్తవంలో ప్రవేశ పెట్టబడిందని చరిత్ర సాక్ష్యం పలుకుతుంది.
క్రైస్తవంలోనికి ప్రవేశించక పూర్వం ఈ త్రిత్వం ఎక్కడ ఉంది?
"భారత దేశ ప్రాచీన చరిత్రలో బ్రహ్మ,విష్ణు మరియు శివుడు అను మూడు పేర్లు కలిగిన త్రిత్వం చూడగలం.అదే విధంగా ఈజిప్టు ప్రాచీన జాతులలో ఓరిసిస్,ఐసిస్ మరియు హురుస్ అను ముగ్గురు పేర్ల త్రిత్వం చూడగలం..ఈ విశ్వాసం కేవలం ప్రాచీన జాతులలోనే కాదు ఆధునిక ప్లాటోనియన్లలో కూడా చూడగలం. -
జేంస్ హాస్టింగ్స్ [ఎన్ సైక్లోపిడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎతిక్స్]
ఈ విధంగా త్రిత్వపు మూలాలను '
ప్రాచీన విగ్రహారాధకులైన మార్గభ్రష్ట జాతుల" నుండి గ్రహింపబడినట్లు ఇంకా అనేక మంది ఆధునిక క్రైస్తవ చరిత్ర మరియు చరిత్రకారుల రికార్డులలో గమనించగలం.ఒకవేళ త్రిత్వం 'పర" సంబధమైన లేఖన పాఠమే అయితే ఇంకా రక్షణ మార్గంలో ఈ సిద్ధాంతం అత్యంత అవశ్యకమే అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంధంలో యెహోవాకాని,ప్రవక్తలు కాని, యేసుకాని,యేసు శిష్యులుకాని మరియు కనీసం పౌలుకాని దీనిని గురించి ఏనాడూ ఎందుకు ప్రస్తావించలేదు?
వాస్తవానికి '
త్రిత్వ దైవత్వవాదం" మరియు
అవతారవాదం" పర సబంధమైన లేఖన పాఠాలే అయితె ఈ సిద్ధాంతాలకు మూలం [ORIGIN]ఎక్కడ ఉండాలి? విగ్రహారాధకులైన మార్గభ్రష్ట అవిశ్వాస జాతులలో ఉండాలా? లేక దైవ విశ్వాసుల జాతులలో ఉండాలా? కచ్చితంగా దీని మూలం 'దైవవిశ్వాసుల జాతుల"లోనే ఉండాలి!అలా అయితే-'
విగ్రహారాధన చేసే ప్రాచీన మార్గభ్రష్ట జాతుల ప్రజలలో అవతారవాదం మరియు త్రిత్వ దైవత్వవాదం ఎందుకు ఉన్నట్లు!?' ఇక త్రిత్వం విషయంలో ప్రముఖ క్రైస్తవ చరిత్రకారుడు చెబుతున్నది ఏమిటో గమనిద్దాం.
'అలాంటి [త్రిత్వమనే]ఆశ్చర్యకరమైన మాటను యేసు క్రీస్తు ఎన్నడూ ప్రస్తావించలేదు.మరియు త్రిత్వమను పదము క్రొత్త నిబంధన యందు ఎక్కడును కనిపించదు.మన ప్రభువు [యేసు] మరణించిన మూడు వందల సంవత్సరముల తరువాత మాత్రమే 'చర్చి" ఆ తలంపును దత్తత తీసుకున్నది" -
అర్దర్ వెయ్ గాల్ ,ది పాగనిజం ఇన్ అవర్ క్రిస్టియానిటీ'
> మరిన్ని ధార్మిక వ్యాసాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.