హిందువులారా దీనిని తప్పక చదవండి,చదివించండి!
క్రైస్తవమతం ముసుగులో పాశ్చాత్య విష సంస్కృతి ప్రచారం!?
బైబిల్ ప్రకారం- నిత్యజీవం పొందటానికిక్రైస్తవమతం స్వీకరించవలసిన అవసరంలేదు!
నేటి క్రైస్తవ పండితుల ప్రచారహోరును బట్టి-ఇహలోక జీవితంలో "శాంతి"-పరలోక జీవితంలో"ముక్తి"వంటి ఉభయ లోక ప్రయోజనాలు లభించాలంటే-"క్రైస్తవమతం స్వీకరించక తప్పదు"అనేఒక అపోహకు చాలా మంది గురవుతున్నారు.ఇది "క్రైస్తవ పండితుల కాల్పనిక భావన" తప్పబైబిల్ గ్రంధ యధార్ధం"మాత్రం కాదనే విషయాన్ని ఈ క్రింది వాక్యాలు తెలుపుతున్న వైనాన్నిగమనించగలరు.
ఆయన [యెహోవా దేవుడు] ప్రతివానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలమునిచ్చును.-రోమా 2:6
పై వాక్యంలో- ప్రతివానికి"అనగా ఈ లోకంలో ఉన్న ఏ మతస్తునికైన సరే వానివాని "మతము"చొప్పున అనికాక "వానివాని క్రియల చొప్పన అన్న దానిని బట్టి-క్రైస్తవమతానికి ఇక్కడ ప్రత్యేకప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టమవుతుంది.నిత్యజీవమును పొందటానికి క్రైస్తవ మత స్వీకారం ఏకైకమార్గమా?లేక మరొక మార్గం ఏదైనా ఉందా?అన్న ప్రశ్నకు ఈ క్రింది వాక్యం ఇచ్చే సమాధానంఏమిటో గమనించగలరు.
సత్ క్రియలను ఓపికగా చేయుచు,మహిమ,ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవమునిచ్చును. - రోమా 2:7
ఈ వాక్యాల ప్రకారం -నిత్యజీవమూను పొందటానికి క్రైస్తవ మత స్వీకారంతో ఎలాంటి సంబంధంలేకుండా,ఎవరైతే సత్ క్రియలను ఓపికగా చేస్తారో ఇంకా తన మహిమను,ఘనతను మరియుఅక్షయతను అన్వేషిస్తారో అలాంటి వారికి నిత్యజీవమును ప్రసాదిస్తానని దేవుడైన యెహోవాస్వయంగా ప్రకటిస్తున్న వైనం పై వాక్యాలలో కనిపిస్తుంది."నిత్యజీవమును పొందటానికి మార్గంబైబిల్ చెబుతున్న పై విషయాలే గాని నేటి క్రైస్తవ పండితులు చెబుతున్న క్రైస్తవ మత స్వీకారంకాదని తెలుస్తుంది.
అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవునిఉగ్రతయు రౌద్రమును వచ్చును....-రోమా 2:9
బైబిల్ గ్రంధం ప్రకారమైతే- *భేదములు పుట్టించి *సత్యమునకు లోబడక *దుర్నీతికిలోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమున వచ్చును"అని ప్రకటిస్తుంది.అయితే నేటిఅధికశాతం క్రైస్తవ పండితుల ప్రకారమైతే -క్రైస్తవులుగా మారనివారిపై దేవుని ఉగ్రతయు రౌద్రమునవచ్చును"అని ప్ప్రకటించబడుతుంది.దీనిని బట్టి -వారి ప్రచారం బైబిల్ గ్రంధానికి విరుద్ధమైనఅసత్య ప్రచారమని తేటపడుతుంది.
దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు,మొదట యూదునికి గ్రీసు దేశస్తునికికూడ,శ్రమయు వేదనయు కలుగును. సత్ క్రియ చేయు ప్రతివానికి,మొదట యూదునికి గ్రీసుదేశస్థునికి కూడ మహిమ ఘనతను సమాధానమును కలుగును. రోమా 2:9-10
దుష్కార్యము చేయు ప్రతి యుని ఆత్మకు [అతడు ఏ మతవర్గం వాడైనా సరే వానికి]శ్రమయువేదనయు కలుగును"అని పైన పేర్కొన్న బైబిల్ వాక్యాన్ని బట్టి తెలుస్తుంది.కాని నేటి అధిక శాతంక్రైస్తవ పండితుల ప్రకారమైతే క్రైస్తవులుగా మారనివారిపై శ్రమయు వేదనయు కలుగును"అనిబైబిల్ కు పూర్తి విరుద్ధంగా ప్రకటించబడుతుంది.
అలాగే "సత్ క్రియ చేయు ప్రతివానికి [అతడు ఏ మతవర్గం వాడైనా సరేవానికి]మహిమను,ఘనతను సమాధానమును కలుగును" అని పైన పేర్కొన్న అదే బైబిల్వాక్యాన్ని బట్టి తెలుస్తుంది.కాని నేటి అధిక శాతం క్రైస్తవ పండితుల ప్రకారమైతే క్రైస్తవులుగామారినవారిపై "మహిమను ఘనతను సమాధానమును కలుగును"అని బైబిలుకు పూర్తివిరుద్ధంగా ప్రకటించబడుతుంది.
ఈ విధంగా "నిత్యజీవము" లేక "నిత్యమరణము"లను నర్ణయించేది "సత్ క్రియ" లేక "దుష్క్రియ "అని బైబిల్ గ్రంధం చెబుతుంటే - ఈ నామకార్ధ క్రైస్తవ పండితులైతే "క్రైస్తవ మతంతీసుకోవటం" లేక "క్రైస్తవ మతం తిరస్కరించటం"అని అంటున్నారు.ఇది ఎంత దారుణమైన వాక్యఅతిక్రమణో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించగలరు.బైబిల్ గ్రంధంలో దేవుడు మతపరమైనవిభజనను ఎందుకు చేయలేదు?అన్న ప్రశ్నకు ఈ క్రింది వాక్యం ఇచ్చే సమాధానం ఏమిటోచూడగలరు.
దేవునికి పక్షపాతములేదు...... - రోమా 2:11
అంటే ఈ నామకార్ధ క్రైస్తవ పండితులలో పక్షపాతం ఉన్నట్లే కదా!అందుకే వారుక్రైస్తవేతరులతోనే కాక స్వయంగా తమ క్రైస్తవుల మధ్య సైతం పక్షపాతాన్ని పాటిస్తూ "డినామినేషన్లభేదము"లను పుట్టిస్తూ వీరే ఎలక్ట్రానిక్ మీడియాలో పరస్పరం దూషించుకుంటూ తమ అసలునైజాన్ని చాటుకుంటున్నారు.
పై అంశం వివరణను బట్టి ,బైబిల్ ప్రకారం -నిత్యజీవం పొందటానికి క్రైస్తమతంస్వీకరించవలసిన అవసరం ఏమీ లేదని సుస్పష్టమవుతుంది.
మతమార్పిడిని నిరసిస్తున్న యేసు!
అయ్యో,వేషధారులైన శాస్త్రులారా,పరిసయ్యులారా,ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరుసముద్రమును భూమిని చుట్టివచ్చెదరు;అతడు కలసినప్పుడు అతనిని మీ కంటే రెండంతలునరకపాత్రునిగా చేయుదురు. -మత్తయి 23:15
దుష్ క్రియలు పోయి-సత్ క్రియలు రాకపోయినప్పుడు మతం మారటం వలన ఒరిగేదేమీఉండదు.బైబిలుకు వ్యతిరేక బొధలు చేసే క్రైస్తవ పండితులు తమతో పాటు తమఅనుయాయులనూ నరకానికి తీసుకుపోవటం తప్ప మరేమీ చేయగలరు? ఆ విషయాన్నేపైవాక్యంలో యేసు ఎంతో ఆవేదనతో తెలుపుతున్నారు.దీనిని బట్టి యేసు కూడా క్రియాత్మకమైనమార్పును కోరుకున్నారేగాని,మతమార్పిడిని,పేరు,సంస్కృతుల మార్పునుగాని ఎన్నడూకోరుకోలేదని బోధపడుతుంది.
అందుకే క్రైస్తవులు కాకపోతేనే మేలని బైబిల్ గ్రంధం ప్రకటిస్తుంది!
ఇప్పటివరకు సాగిన వాక్యపరిశీలన ద్వారా-అన్యులకు తప్ప యేసును నమ్ముకున్న క్రైస్తవులకుపాపక్షమాపణ లేదని తేలిపోయింది.అలాగే "యేసు పాపుల రక్షకుడు"కాదని కూడాతేలిపోయింది.క్రైస్తవమత స్వీకారం ద్వారా మాత్రమే కాక,దుష్ క్రియను విడిచి సత్ క్రియనుఆచరించి ఏ మతవర్గం వానికైనా "నిత్యజీవం"లభిస్తుందని తెలిసింది.కనుక ఈ క్రింది వాక్యంచెబుతున్నదేమిటో చూడగలరు.
వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని,తమకు అప్పగింపబడిన పరిశుద్దమైనఆజ్ఞ నుండి తొలగిపోవుటకంటే ఆ [క్రస్తవ] మార్గం అనుభవపూర్వకముగా తెలియక యుండుటయేవారికి మేలు. -పేతురు 2:21
ఎవరైనా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారు ఏ చిన్నపాటి పాపానికి పాల్పడకూడదు.అది ఎంత గొప్పభక్తునికైనా సాధ్యం కాని విషయం.మనిషి అన్నాక ఎంతోకంత పాపానికి పాల్పడుతూనేఉంటాడు.అటువంటప్పుడు క్రైస్తవ్యం గురించి తెలుసుకుంటే మేలుకంటే కీడే ఎక్కువ!అందుకే-క్రైస్తవమార్గము తెలియకపోవుటయే ప్రజలకు మేలు"అని పైవాక్యం కోరుతుంది.దీనిని బట్టి "యేసుపాపుల రక్షకుడు-క్రైస్తవ్యం రక్షణమార్గం"అని జరుగుతున్న ప్రచారం బైబిల్ గ్రంధానికి వ్యతిరేకమైనఅసత్యప్రచారమని తెలుస్తుంది.
దీనికి ముందు పేజీలు : 1 2