Posted by Sakshyam Magazine on Monday, July 14, 2014
హిందువులారా దీనిని తప్పక చదవండి,చదివించండి!
క్రైస్తవమతం ముసుగులో పాశ్చాత్య విష సంస్కృతి ప్రచారం!?
హిందూధర్మంలో ఒక ధార్మికుని వలన జరిగే పాపాలకూ క్షమాపణ ఉన్నట్లు క్రైస్తవునిగా మారిన తరువాత జరిగే పాపాలకు క్రైస్తవ్యంలో క్షమాపణ లేదు!
దహించబోయే అగ్నియే పాపులైన క్రైస్తవుల అంతిమ గమ్యం!!
మానవుడు సహజంగానే బలహీనుడు.అతడు ఎంత మారుమనస్సు పొందినా,బాప్తిస్మము తీసుకున్నా అతని వలన ఏదో ఒక విధమైన పాపాలు సంభవిస్తూనే ఉంటాయి."మనిషి మరణానికి ముందువరకూ అతని కొరకు పశ్చాత్తాప ద్వారాలు తెరుచుకునే ఉంటాయి"అని హిందుశాస్త్రాలు, ముహమ్మద్ మరియు ఖురాన్ బోధ.అయితే యేసు మరియు బైబిల్ బోధ ఏమిటో ఈ అంశాలలో చూడగలరు.
దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన[రక్షణ పొందిన] తరువాత తప్పిపోయినవారు,తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయన[యేసు]ను అవమాన పరచుచున్నారు.గనుక మారుమనస్సుపొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము. హెబ్రీయులకు 6:5
పై వాక్యం ప్రకారం -ఎవడైనా మారుమనస్సును పొంది, బాప్తిస్మము తీసుకున్న తరువాత ఏకారణం చేతనైనా ఒకవేళ పాపాలలో పడిపోటే- "మారుమనస్సు పొదునట్లు అట్టివారిని మరలనూతనపరచుట అసాధ్యము"అని బైబిల్ ప్రకటిస్తుంది.దీనినిబట్టి-బాప్తిస్మము తీసుకున్న వెంటనేపశ్చాత్తాపద్వారాలు మూసుకుపోతాయి"అని తెలుస్తుంది.బలహీనుడైన ఒక మనిషికి ఇది ఎంతప్రమాదకరమైన పరిస్థితో ఊహించగలరు.ఇక అటువంటి పాపులైన క్రైస్తవుల పరలోక పర్యవసానం ఏమిటి?అన్న ప్రశ్నకు బైబిలు ఇస్తున్న సమాధానం ఏమిటో ఈ క్రింది వాక్యాలలో చూడగలరు.
మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు.గాని న్యాయపు తీర్పునకు భయములో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను నుండును. హెబ్రీయులకు 10:26-27
పాపులైన క్రైస్తవుల అంతిమ నివాసం "న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు,విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను నుండును" అని పైవాక్యం ప్రకటిస్తుంది.ఈ విధంగా క్రైస్తవులకు క్రైస్తవ్యం నష్టదాయకమే కాని లాభదాయకం మాత్రం కాదు.
క్రైస్తవుడైతే అతని పాపంలో తీవ్రత పెరుగుతుంది!
మనిషిలో ఉన్న మానసిక-శారీరక దౌర్భల్యాలను బట్టి అతని వలన పాపాలు జరుగుతూఉంటాయి.అలాంటి బలహీనుడికి "మరణానికి ముందు వరకూ పశ్చాత్తాప ద్వారాలు తెరుచుకునేఉండాలి" తద్వారా అతడు రక్షించబడే అవకాశం ఉంటుంది.ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసంవాడు ఎంత పాపం చేసుకుంటే అంతే శిక్ష పడాలి.కాని క్రైస్తవుడైన పాపానికి కలిగే నష్టం ఏమిటోక్రీస్తు నోటనే వినండి.
అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి -ఇదిగో! స్వస్తత పొందితివి;మరియెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్లి తన్నుస్వస్తపరచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. యోహాన్ 5:14-15
ఈ వాక్యంలో గమనార్హ వాక్యభాగం -"ఇదిగో! స్వస్తత పొందితివి;మరి యెక్కువ కీడు నీకుకలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము"అన్నది యేసుద్వారా రక్షణ పొందితేనే కదా స్వస్తతకలిగేది.యేసులో రాకముందు కంటే యేసులో వచ్చిన తరువాత "మరి యెక్కువ కీడు"కలుగుతుందని యేసు చేస్తున్న పై బోధను బట్టి సుస్పష్టం అవుతుంది.ఇదే విషయాన్ని తెలిపేమరొక వాక్యాన్ని ఈక్రింది చూడగలరు.
వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానము [బాప్తిస్మము]చేత ఈలోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటి [లోకమాలిన్యముల]లో చిక్కుబడివాటిచేత జయింపబడిన యెడల,వారి కడవరి [క్రైస్తవునిగా మారిన] స్థితి మొదటి [అన్యుడిగాఉన్నప్పటి] స్థితి కంటే మరి చెడ్డదగును. పేతురు 2:20-21
పైవాక్యం -రెండు స్థితులలోని ఏ స్థితి ప్రమాదకరమైనదో చూపిస్తుంది.మొదటి స్థితి అన్యత్వంఅంటే-క్రైస్తవుడు కాని స్థితి లేక హిందువుగా ఉన్న స్థితి.రెండవ స్థితి క్రైస్తవ్యం."వారి మొదటి[హిందువుగా ఉన్నప్పటి] స్థితి కంటే కడవరి [క్రైస్తవునిగా మారిన] స్థితి మరి చెడ్డదగును"అన్నదిఅత్యంత గమనార్హమైన వాక్యభాగం.దీనిని బట్టి ఒక వ్యక్తికి క్రైస్తవుడు కావడం ప్రమాదకరమేకదా!